Advertisement

Gas Cylinders: ఉచిత గ్యాస్ కనెక్షన్ మరియు కేవలం రూ.550కే… సంవత్సరానికి 12 సిలిండర్లు

Pradhan Mantri Ujjwala Yojana: ఇంటి వంటగదిలో గ్యాస్ స్టవ్ వచ్చిన తర్వాత జీవితాలు ఎంత సులభమవుతాయో అందరికీ తెలుసు. కట్టెల పొగతో సతమతమయ్యే రోజులు పోయి, వేగవంతమైన వంటలు, ఆరోగ్యకరమైన వాతావరణం వస్తాయి. కానీ, ఆర్థిక ఇబ్బందులు చాలా మందిని ఈ సౌకర్యం నుంచి దూరం చేస్తున్నాయి. గ్యాస్ సిలిండర్ ధరలు రూ.900 దాటిన నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం పేద కుటుంబాలకు సాయం చేసేందుకు ప్రధాన మంత్రి ఉజ్వల యోజనను తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా గ్రామీణ మహిళలు శుభ్రమైన ఇంధనాన్ని సులభంగా పొందుతున్నారు, అది కూడా రూ.550కే సిలిండర్ తీసుకునే తీసుకుంటున్నారు.

For more updates join in our whatsapp channel

WhatsApp Group Join Now

Table of Contents

Advertisement

2016లో ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ యోజన, ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా కుటుంబాలను చేరువ చేసింది. మొదటి దశలో 10 కోట్ల కనెక్షన్లు, రెండో దశలో 2.34 కోట్లు విడుదల చేశారు. ఇప్పుడు 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.12,060 కోట్లు కేటాయించి, మరిన్ని కుటుంబాలకు విస్తరించారు. ఇలా దాదాపు 10.33 కోట్ల కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి.

ఈ యోజనలో ఆర్థిక సహాయం కూడా ముఖ్యమైనది. కనెక్షన్ తీసుకునేటప్పుడు సెక్యూరిటీ డిపాజిట్, రెగ్యులేటర్ వంటి ఖర్చులకు సహాయం అందుతుంది. ఉదాహరణకు:

ఆర్థిక సహాయం14.2 KG సిలిండర్5 KG సిలిండర్
సెక్యూరిటీ డిపాజిట్రూ. 1850రూ. 950
రెగ్యులేటర్రూ. 150రూ. 150
LPG హోస్రూ. 100రూ. 100
గృహోపకరణ గ్యాస్ వినియోగదారు కార్డురూ. 25రూ. 25
భద్రతా తనిఖీ రుసుమురూ. 75రూ. 75
మొత్తం ఆర్థిక సహాయంరూ. 2200రూ. 1300

ఇంకా, వడ్డీ లేని రుణం ద్వారా స్టవ్ కొనుగోలుకు సాయం ఉంది. ఏడాదికి 12 సిలిండర్లు సబ్సిడీతో లభిస్తాయి, తద్వారా పొగ వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల నుంచి మహిళలు, పిల్లలు రక్షణ పొందుతారు. బొగ్గు, కట్టెలు వంటి సాంప్రదాయ ఇంధనాలకు బదులు శుభ్రమైన LPGను ప్రోత్సహించడం ఈ పథకం లక్ష్యం.

అర్హతలు: మహిళలు 18 ఏళ్లు దాటి ఉండాలి, BPL కుటుంబాలు, SC/ST వారు, లేదా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన లబ్ధిదారులు. ఆధార్, రేషన్ కార్డు, కుల ధృవీకరణ వంటి పత్రాలు అవసరం. e-KYC తప్పనిసరి, బ్యాంక్ వివరాలు సమర్పించాలి.

NTR Bharosa Pension Update
NTR Bharosa Pension Update: ఫిబ్రవరి నెల పెన్షన్ లో 17 వేలకు మంది పైగా పేర్లు తొలగింపు

దరఖాస్తు చేయడం కూడా సులువు. ఆన్‌లైన్‌లో pmuy.gov.in సైట్‌లో వెళ్లి, ఏజెన్సీ ఎంచుకుని, వివరాలు నమోదు చేసి e-KYC పూర్తి చేయవచ్చు. ఆఫ్‌లైన్‌లో ఫామ్ డౌన్‌లోడ్ చేసి, డిస్ట్రిబ్యూటర్ వద్ద సమర్పించండి. రీఫిల్ బుకింగ్ కోసం SMS, మిస్డ్ కాల్ లేదా వాట్సప్ ఉపయోగించవచ్చు. నంబర్లు: 7718955555 (SMS), 8454955555 (మిస్డ్ కాల్), 7588888824 (వాట్సప్). సబ్సిడీ నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది.

pmuy.gov.in
Source: pmuy.gov.in

దగ్గరలోని గ్యాస్ ఏజెన్సీ తెలుసుకోవడానికి సైట్‌లోనే ఆప్షన్ ఉంది. రాష్ట్రం, జిల్లా ఎంటర్ చేస్తే చిరునామాలు వస్తాయి. ఈ యోజన పేదల జీవితాలను మార్చుతోంది, మహిళలకు స్వాతంత్ర్యం ఇస్తోంది. మీ చుట్టుపక్కల ఎవరైనా ఇంకా కట్టెలతో కష్టపడుతుంటే, ఈ సమాచారం పంచండి.

Disclaimer: ఈ సమాచారం సాధారణ ఉపయోగం కోసం మాత్రమే. ఆర్థిక సహాయం, సబ్సిడీలకు సంబంధించిన వివరాలు అధికారిక వెబ్‌సైట్ లేదా సంబంధిత శాఖలో ధృవీకరించుకోండి.

FAQs

ఉజ్వల యోజనకు ఎవరు అర్హులు?

18 ఏళ్లు దాటిన మహిళలు, BPL కుటుంబాలు, SC/ST వారు అర్హులు.

దరఖాస్తు చేయడానికి ఏ పత్రాలు కావాలి?

ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రం ముఖ్యమైనవి అవసరం అవుత్తాయి.

Andhra Pradesh Vehicle Cess
AP Vehicle Cess Hike: పండగ వేళ సామాన్యులకు భారీ షాక్… వాహనాలపై అదనంగా 10 శాతం రహదారి భద్రతా టాక్స్
సబ్సిడీ ఎలా వస్తుంది?

డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది.

రీఫిల్ బుకింగ్ ఎలా చేయాలి?

SMS, మిస్డ్ కాల్ లేదా వాట్సప్ ద్వారా సులభంగా బుక్ చేయవచ్చు.

About Writer

Gnanesh

Gnanesh - 4 సంవత్సరాల అనుభవం కలిగిన కంటెంట్ ప్రొడ్యూసర్. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు, ఉద్యోగాలు మరియు తాజా వార్తలపై విస్తృత అనుభవం కలిగినవాడు. తన కంటెంట్ ద్వారా సమాచారాన్ని సరళంగా, సమర్థవంతంగా ప్రజలకు అందిస్తాడు.

Read More
Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a Comment

Advertisement